
Swetaswatara Upanishattu (Telugu) (Paperback)
శ్వేతాశ్వతర ఉపనిషత్తు ( టీకా తాత్పర్య సహితం )
బ్రహ్మవిద్యను అధ్యయనం చేసే సాధకులకు మనసులో ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తాయి. సాధకుల జ్ఞానపిపాసను తీర్చి అమృతత్త్వాన్ని ప్రసాదించే వేద విజ్ఞాన నిధులే ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తు ఆరు అధ్యాయాలు, 113 మంత్రాలతో కూడుకొని ఉంది. కృష్ణ యజుర్వేదానికి చెందినదై, శ్వేతాశ్వతర బ్రహ్మర్షిచే ఆవిష్కరించబడినది. మనం ఎక్కడనుండి జన్మించాం? మనం జీవించడం ఎందుకు? మనకు చరమస్థానం ఎక్కడ? ఎవని నియమానుసారం సుఖదుఃఖాలకు లోబడి ఉంటున్నాం? వంటి తాత్విక ప్రశ్నలతో ఈ ఉపనిషత్తు ప్రారంభమవుతుంది.